ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు కరీంనగర్ పోస్టల్ సూపరిండెంట్ శ్రీనివాసరావు మంగళవారం రూ. 10 లక్షల ప్రమాద భీమా చెక్కును అందజేశారు.జిల్లాలోని కొడిమ్యాల మండలం, డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన , లయి శెట్టి వెంకటేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను పోస్ట్ ఆఫీస్ లో రూ 399కే 10 లక్షల ప్రమాద భీమా పథకాన్ని తీసుకోవడంతో అతడి కుటుంబానికి భీమా కింద 10 లక్షలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కును మంగళవారం వెంకటేష్ కుటుంబ సభ్యులకు సూపరింటెండెంట్ అందించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సంవత్సరానికి రూ.399 భీమా తీసుకుంటే ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈనెల 30 తారీకు వరకు ప్రత్యేక శిబిరాల ద్వారా ప్రతి పోస్ట్ ఆఫీస్ లో ఈ భీమా తీసుకోవచ్చునని తెలిపారు. పోస్టల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ సూపరింటెండెంట్ శ్రీనివాస రావు సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాధ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ బీమా చేసుకోవాలని మరణించిన కుటుంబానికి ఆసరాగా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిస్టంట్ సూపరిండెంట్ కిరణ్ రెడ్డి , ఐపిపిబి బ్రాంచ్ మేనేజర్ తొర్తి రాజేష్, రేవతి , మెయిల్ ఓవర్సీస్ శ్రీనివాస్, బీపీయం షబ్బీర్, పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.