తుగ్గలి
ఆంధ్రప్రదేశ్ నందు మొదటిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమ పోస్టర్ ను మండల పరిషత్ అధ్యక్షురాలు ఆదెమ్మ, ఉపాధ్యక్షులు ఎర్ర నాగప్ప,ఎంపీడీవో సావిత్రి, ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు,పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు లు మంగళవారం రోజున స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 15 సంవత్సరాలు పైబడిన పురుషులు గానీ,మహిళలు గానీ డిసెంబర్ 12వ తేదీ లోపు ఆసక్తిగల క్రీడను ఎంపిక చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని వారు తెలియజేశారు. డిసెంబర్ 15 నుండి “ఆడుదాం ఆంధ్రా” రాష్ట్ర వ్యాప్త క్రీడా కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు తెలియజేశారు.గ్రామ సచివాలయ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఈ టోర్నీ నిర్వహించబడుతుందని వారు తెలియజేశారు. నియోజకవర్గ స్థాయి,జిల్లాస్థాయి మరియు రాష్ట్ర స్థాయిలలో గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతులను ప్రభుత్వ అందజేస్తుందని వారు తెలియజేశారు. పురుషులకు మరియు మహిళలకు వేరువేరుగా క్రీడలో నిర్వహించబడతాయని వారు తెలియజేశారు.కావున ఆసక్తిగల వారు త్వరగా రిజిస్ట్రేషన్ చేయించుకొని “ఆడుదాం ఆంధ్రా” రాష్ట్రస్థాయి క్రీడా కార్యక్రమంలో పాలుపంచుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి తిరుపాల్,పంచాయతీ కార్యదర్శులు అంకాలప్ప,రాజు నాయక్,గోపాల్, రాంపల్లి సర్పంచ్ మనీంద్ర,ఫిజికల్ డైరెక్టర్లు చందు నాయక్,వేణు,జొన్నగిరి హాస్టల్ వార్డెన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.