సికింద్రాబాద్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్ బిజెపి పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేసారు. తార్నాక డివిజన్లోని లాలపేట్, లో కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో మనం వేసే ఓట్లు సాధారణ ఓట్లు కాదని దేశ ప్రధాని ని ఎన్నుకునే ఓటు అని అన్నారు. ఈ ఎన్నికలు దేశం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో డిసైడ్ చేసే ఎన్నికలు అన్నారు. నరేంద్రమోదీ ని మళ్ళీ ప్రధాని చేయడం కోసం అందరూ ఆశీర్వదించాలని కోరారు. కరోనా సమయంలో దేశ ప్రజలకు ఉచిత బియ్యం అందించారని గుర్తు చేశారు.
Prev Post