ప్రచారంలో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి అసెంబ్లీ స్థానాలు 162 పార్లమెంటు స్థానాలు 24 స్థానాలు సాధిస్తాం జూన్ 9వ తేదీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అభ్యర్థి బొజ్జ రోశయ్య బద్వేలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూన్ 9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని బద్వేలు బిజెపి అభ్యర్థి బొజ్జో రోశయ్య తెలిపారు బద్వేల్ మండలం బయనపల్లి గ్రామపంచాయతీలో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి పార్టీలు అమలు చేస్తున్న మేనిఫెస్టో కరపత్రాలు ఇచ్చి ఈనెల 13 తేది జరిగే ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీకి కమలం గుర్తుపై కడప పార్లమెంటుకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు జరగబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలకు సంబంధించి 162 అసెంబ్లీ పార్లమెంటు సంబంధించి 24 సీట్లు వస్తాయని రోశయ్య ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలు ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై విసుగు చెంది ఉన్నారని అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఇసుక మట్టి గ్రావెల్ మద్యం మాఫియాలు పెరిగిపోయాయి అని ఆరోపించారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దోచుకు తింటున్నారని ఆరోపించారు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు ఆయన ఆరోపించారు దాదాపు 2000 కోట్ల రూపాయలు పైగా అవినీతి జరిగినట్లు తెలిపారు ప్రభుత్వ భూముల కబ్జా ద్వారానే దాదాపు 500 కోట్ల రూపాయల పైగానే అవినీతి జరిగినట్లు ప్రజలే బహిరంగంగా అంటున్నారని ఆయన ఆరోపించారు జరిగే ఎన్నికల్లో బద్వేల్లో బిజెపి గెలవడం ఖాయమని రోశయ్య అన్నారు ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ఉపయోగం లేదన్నారు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కూటమి పార్టీలు బలంగా ఉన్నట్లు తెలిపారు చేతికి ఓటు వస్తే సైకిల్ కమలం గుర్తుపై ఓటు వేసేందుకు ఓటర్లంతా సిద్ధంగా ఉన్నట్లు రోశయ్య తెలిపారు కూటమి పార్టీలు అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలు పార్టీకి శ్రీరామరక్ష అని రోశయ్య అన్నారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన అభ్యర్థి రోశయ్యకు గ్రామస్తులు మంగళహారతులు బట్టి జేజేలు పలికారు ప్రతి ఇంటి వద్ద ఆయనకు ప్రజలు స్వాగతం పలికారు భారీ ఎత్తున జరిగిన ఈ ప్రచారంలో బద్వేలు మండల గ్రామీణ తెలుగుదేశం అధ్యక్షుడు రవి కుమార్ రెడ్డి పంచాయతీ మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి నాయకులు పిల్లి భాస్కర్ బాబు నాగేంద్ర నాగ సుబ్బారెడ్డి బిజీవేముల వెంకటసుబ్బారెడ్డి గాజుల పల్లె శంకర్ రెడ్డి నాగిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్ మస్తానయ్య మాజీ ఎంపిటిసి సుబ్బారాయుడు రమణారెడ్డి శివయ్య రవి సుధాకర్ సత్యనారాయణ రెడ్డి బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు