తిరుపతి విమానాశ్రయంలోని శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు
తిరుమల డిసెంబర్ 16
దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ను మార్పు చేశామని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుపతి విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తున్న విషయం తెలిసిందే.విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా శనివారం నుంచి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో ఆఫ్లైన్ టికెట్లను జారీ చేయడం ప్రారంభించామని వివరించారు. ప్రతి రోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్లైన్ టికెట్లను అందజేస్తామన్నారు. భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పును గమనించాలని కోరారు.