Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పూటకో మాట చెబుతున్న కేసీఆర్.

0

పూటకు ఒక మాట చెప్తూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ అన్నారు.బోడుప్పల్,పీర్జాది గూడా,మేడిపల్లి, పర్వతాపూర్ మున్సిపల్ కార్పోరేషన్ లలో సుమారు 110 కోట్ల ఎస్ ఎన్ డి పి పనులు జరగడం లేదని ఉప్పల్ బస్ డిపో  ఎదురుగా నిరసన దీక్షా చేపట్టారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హరివర్ధన్ రెడ్డి,స్థానిక బోడుప్పల్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వర్షా కాలంలో ఈ ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ ఇబ్బందులను కళ్ళారా చూసిన మేయర్లు,మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపనలు చేసి ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు.రానున్నది వర్షా కాలం కాబట్టి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి.లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు.

గ్రూప్‌-4 అభ్యర్ధులకు బయోమెట్రిక్ తప్పనిసరి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie