సి. బెలగల్
సి. బెలగల్ మండలంలోని మూడుమాల, పల్దొడ్డీ,రంగాపురం గ్రామాలలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఆది మూలపు సతీష్,కోడుమూరు వైఎస్ఆర్సీపీ సమన్వయ కర్త కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్య క్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఆది ములపు సతీశ్ మాట్లడుతూ జగన్ మోహన్ రెడ్డి మన కోసం 130 సార్లు బటన్ నొక్కితే మనం ఆయనను ముఖ్య మంత్రి చేయడానికి 2 సార్లు బటన్ నొక్కి ఎంఎల్ఏ అభ్యర్థి అయిన నన్ను ఎం.పి అభ్యర్తి అయిన బి.వై రామయ్య కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.మీ పిల్లలకు భవిష్యత్లో విద్య , వైద్యం అందించే బాధ్యత నాది అని పేర్కొన్నారు.అనంతరం కోడుమూరు వైఎస్ఆర్సీపీ సమన్వయ కర్త కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి మాట్లడుతూ చంద్ర బాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్య మంత్రిగా పరిపాలన చేసిన చెప్పుకోవడానికి ఒక్క మంచి పథకం కూడా లేదు.కానీ మన జగన్ మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లోనే నాడు నేడు ద్వార స్కూల్, హాస్పటల్ రూపు రేఖలు మార్చారు . మన గ్రామాలలో మన ఎదుటనే రైతు భరోసా కేంద్రాలు, సచివాలయలు ఏర్పాటు చేసి ప్రతి సంక్షేమ పథకాలు మన ఇంటి దగ్గరకే వస్తున్నాయి అని పేర్కొన్నారు. ఇన్ని మంచి పనులు చేసే ప్రజా ప్రభుత్వాన్ని మరో సారి అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, మణి గాంధీ,వైఎస్ఆర్సీపీ స్టేట్ కమిటీ మెంబర్ సంధ్య విక్రమ్, ఎం.పి.పి బొంతల మున్నెప్ప, మండల కన్వీనర్ సోమ శేఖర్ రెడ్డి,తులసి రెడ్డి, రఘు రెడ్డి,ఎంపీటీసీ ప్రేమమ్మ, సింగిల్ విండో అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి , సర్పంచులు రత్నమ్మ,మద్దిలేటి,గుండ్రేవులు సర్పంచ్ శ్రీనివాస రెడ్డి,పాండు రంగన్న,ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post