బిజెపి,బిఆర్ఎస్ నాయకులపై పోలీస్ స్టేషన్ లోకాంగ్రెస్ నేతల ఫిర్యాదు
రామాయంపేట
మెదక్ జిల్లా రామాయంపేటలో బిజెపి, బీఆర్ఎస్ నాయకులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కొందరు చూడలేని బిజెపి, బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తూ ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఖబద్దార్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయే వాళ్ళు కాదని వారు హెచ్చరించారు.