మేమంతా టీడీపీలోనే ఎంఎస్ బేగ్
అమరావతి
తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని టీడీపీ నేత ఎం. ఎస్ బేగ్ గురువారం కలిసారు. తెలుగుదేశం లోనే తామంతా కొనసాగుతామని బేగ్, అతని అనుచరులు స్పష్టం చేసారు. బేగ్ ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ని చేస్తానంటూ కేశినేని నాని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కేశినేని నాని తో తామెవ్వరం వెళ్లట్లేదని లోకేష్ కి బేగ్, అతని అనుచరులు స్పష్టం చేసారు