Threat to YCP from Sharmila | షర్మిల నుంచి వైసీపీకి ముప్పు | Eeroju news

YS Sharmila

షర్మిల నుంచి వైసీపీకి ముప్పు విజయవాడ, జూలై  26 (న్యూస్ పల్స్) Threat to YCP from Sharmila   వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకూ జాతీయ రాజకీయాల్లో  భారతీయ జనతా పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్ గా ఉన్నారు. స్పీకర్ అభ్యర్థిని నిలబెడితే అడగకుండానే మద్దతిచ్చారు. టీడీపీ, జనసేన ఉన్నందున ఎన్డీఏ కూటమికి మద్దతివ్వడం ఎందుకన్న  ఆలోచన చేయలేదు. అంశాల వారీగా తమ మద్దతు  బీజేపీకి ఉంటుందన్నారు. రెండు రోజుల కిందట విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అయితే హఠాత్తుగా బుధవారం సీన్ మారిపోయింది. జగన్ కోసం ఇండీ కూటమి నేతలంతా తరలి వచ్చారు. మద్దతు పలికారు. అందరూ ఇండియా కూటమిలోకి రావాలని జగన్ కు ఆహ్వానం పలికారు. ప్రజాదర్భార్ ప్రారంభిస్తానని చెప్పిన రోజున జగన్ కాలు నొప్పికి…

Read More

Law change for local bodies | స్థానిక సంస్థల కోసం చట్టం మార్పు | Eeroju news

Law change for local bodies

స్థానిక సంస్థల కోసం చట్టం మార్పు విజయవాడ, జూలై 26, (న్యూస్ పల్స్) Law change for local bodies ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులవుతోంది. దీంతో పాలనాపరమైన నిర్ణయాలతో పాటు రాజకీయ అంశాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా శాసనమండలితో పాటు రాజ్యసభలో ఇప్పటికీ వైసీపీకి ఆధిక్యత ఉంది. మరోవైపు స్థానిక సంస్థల్లో కూడా వైసిపి ప్రాతినిధ్యం ఉంది. దీనిని ఎలాగైనా అధిగమించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.స్థా నిక సంస్థలకు సంబంధించి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల కాలం అనివార్యం. అప్పట్లో దీనిపై జగన్ సర్కార్ చట్టం చేసింది. ఇప్పుడు స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలంటే చట్ట సవరణ చేయాలి. అందుకే కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. చట్ట సవరణకు ప్రయత్నాలు…

Read More

If women are harassed we will slap them… | మహిళల్ని వేధిస్తే తాటతీస్తాం… | Eeroju news

If women are harassed, we will slap them...

మహిళల్ని వేధిస్తే తాటతీస్తాం… విజయవాడ, జూలై 25 If women are harassed we will slap them…   ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే వారి సంగతి చూడటానికి ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మహిళలపై అనుచితమైన పోస్టులు పెట్టాలంటే  ఎవరైనా సరే భయపడేలా చేస్తామని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల కాలంలో సోషల్ మీడియా ఉన్మాదులు పెరిగిపోయారని..ఎంతో మంది టీడీపీ నేతలపై దారుణమై వ్యాఖ్యలు చేశారన్నారు. అధికార పార్టీ నేతలే వారిని ప్రోత్సహించారన్నారు. ఇక నుంచి ఎవరైనా అలాంటి పోస్టులు పెడితే.. కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించారు. ఇలా వేధించే వారిని కట్టడి చేయడానికి ప్రత్యేక విభాగం పెట్టాలని నిర్ణయించారు. ఎన్డీఏపార్టీలకు చెందిన వారు కూడా మహిళపై ఎలాంటి పోస్టులు…

Read More

Akhilesh Yadav | అఖిలేష్ లాబీయింగ్… | Eeroju news

Akhilesh Yadav

అఖిలేష్ లాబీయింగ్… ఇండియా కూటమిలోకి జగన్ విజయవాడ, జూలై 25  (న్యూస్ పల్స్)   Akhilesh Yadav జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా? జాతీయ పార్టీల అండ ఉండాలనుకుంటున్నారా? అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలనుకుంటున్నారా? జాతీయస్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ జగన్ హస్తిన బాట పట్టారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. మద్దతు తెలపాలని జాతీయస్థాయిలో అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. కానీ పార్టీల నుంచి స్పందన అంతంత మాత్రమే. ఏపీలో మిగతా పార్టీలు స్పందించలేదు. రాజకీయ స్నేహితుడైన కేసీఆర్ పార్టీ సైతం పెద్దగా మొగ్గు చూపులేదు. కానీ అనూహ్యంగా సమాజ్ వాది పార్టీ ధర్నాకు సంఘీభావం తెలపడం విశేషం. తద్వారా కొత్త సమీకరణలకు సంకేతాలు వెలువడ్డాయి. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ద్వారా…

Read More

Trying for sympathy… Jaganmohan Reddy | సింపతి కోసమే ప్రయత్నమా… | Eeroju news

Trying for sympathy... Jaganmohan Reddy

సింపతి కోసమే ప్రయత్నమా… విజయవాడ, జూలై 25  (న్యూస్ పల్స్) Trying for sympathy… Jaganmohan Reddy వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్  రెడ్డి ఇప్పుడు హోదా యోధునిగా మారారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం యోధునిగా మారిన అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడుతున్నారు. మొదట తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తారని ఆయన అనుకున్నారు. కానీ అలా చేయకపోవడంతో స్పీకర్‌కు లేఖ రాశారు. స్పీకర్ పట్టించుకోలేదు. మంగళవారం జరిగిన సభలో వైఎస్ఆర్‌సీపీ పక్ష నేతగానే జగన్ మోహన్ రెడ్డిని గుర్తిస్తూ ప్రకటన చేశారు. దీంతో జగన్ వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా  స్పీకర్ ను ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని…

Read More

A flood of funds for Amaravati | అమరావతికి నిధుల వరద | Eeroju news

అమరావతికి నిధుల వరద

అమరావతికి నిధుల వరద విజయవాడ, జూలై 25  (న్యూస్ పల్స్) A flood of funds for Amaravati సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 జూలై నెలలో ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెట్టుబడుల్ని ఉపసంహరించు కున్నాయి. 2019లో ఏపీ అధికారంలోకి వచ్చిన వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, కేంద్రం ఆలోచనలు నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2014-18 మధ్య ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అమరావతి నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. 2018లో జరిగిన నాటకీయ పరిణామలు, ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి.…

Read More

Ummareddy Venkateshwarlu | వైసీపీలో మండలి చిచ్చు | Eeroju news

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

వైసీపీలో మండలి చిచ్చు విజయవాడ, జూలై 25 (న్యూస్ పల్స్) Ummareddy Venkateshwarlu వైసీపీలో అంతర్గత పోరు మొదలైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ ఢిల్లీ వేదికగా గళం ఎత్తారు. జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. జంతర్ మంతర్ వద్ద జగన్ చేపట్టిన దీక్షకు సమాజ్ వాది పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోనే శివసేన పార్టీ మద్దతు ప్రకటించింది. అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలిపారు. శివసేన తరుపున ఎంపీ హాజరయ్యారు. ఏపీలో నరమేధం కొనసాగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఒకవైపు జాతీయ స్థాయిలో జగన్ ఇతరుల మద్దతు పొందుతుండగా.. ఏపీలో వైసీపీ నుంచి నేతల నిష్క్రమణ ప్రారంభమైంది. అది కూడా కీలకమైన గుంటూరు జిల్లా నుంచి. నిన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసిపికి గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో టిడిపి…

Read More

YCP is silent on the budget | బడ్జెట్ పై నోరెత్తని వైసీపీ…. | Eeroju news

యువత విద్య కోసం 4 లక్షల కోట్లు

బడ్జెట్ పై నోరెత్తని వైసీపీ…. విజయవాడ, జూలై 24, (న్యూస్ పల్స్) YCP is silent on the budget కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సముచిత స్థానం దక్కింది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం పెద్దపీట వేసింది. ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం సాయం చేస్తామని ప్రకటించింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు సమకూర్చుతామని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకి బడ్జెట్లో పెద్దపీట వేశారు. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో అక్కడి అధికారపక్షం, విపక్షం కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. దాయాది రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపులపై ఆహ్వానిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం విపక్షంగా ఉన్న వైసిపి ఇంతవరకు స్పందించలేదు. వైసిపి…

Read More

A Good budget for AP after 20 years… | 20 ఏళ్ల తర్వాత ఏపీకి మంచి బడ్జెట్… | Eeroju news

A Good budget for AP after 20 years...

20 ఏళ్ల తర్వాత ఏపీకి మంచి బడ్జెట్… విజయవాడ, జూలై 24, (న్యూస్ పల్స్) A Good budget for AP after 20 years… కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ,  బీహార్ గురించి చర్చ జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారని అంటున్నారు. బీహార్ గురించి పక్కన పెడితే ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమే. ఎన్నో  సమస్యల్లో ఉన్న రాష్ట్రానికి ఊపిరి పోసేలా నిధుల కేటాయింపు ఉంది. గత ఐరవై ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ అనే పదం కేంద్ర బడ్జెట్‌లో వినిపించేది కాదు. చివరికి రాష్ట్ర విభజన తర్వాత కూడా. ఎందుకిలా అంటే.. అది రాష్ట్రాల బడ్జెట్ కాదని.. కేంద్ర బడ్జెట్ అని.. వాదించేవారు. అయితే ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకమైన కేటాయింపులు చేసేవారు. ఆ…

Read More

Jagan is getting closer to Congress | కాంగ్రెస్ కు దగ్గరవుతున్న జగన్ | Eeroju news

కాంగ్రెస్ కు దగ్గరవుతున్న జగన్

కాంగ్రెస్ కు దగ్గరవుతున్న జగన్ విజయవాడ, జూలై 24  (న్యూస్ పల్స్) Jagan is getting closer to Congress వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయిలో తనకు అండగా నిలబడే ఓ పార్టీ కోసం చూసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఆయన సేఫ్ గేమ్ ఆడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ, జనసేనలతో కలిసిపోవడంతో తనను ఇబ్బంది పెడుతుందని తాను ఎంత లాయల్ గా ఉన్నా వదలబోరని అనుకుంటున్నట్లగా తెలుస్తోంది. అందుకే ప్రత్యేకహోదా అంశాన్ని తరచూ ప్రస్తావిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జగన్ మాత్రం బహిరంగంగా ప్రత్యేకహోదా గురించి మాట్లాడటం లేదు. కానీ వచ్చే కొద్ది రోజుల్లో జగన్ పై కేసుల విచారణ ఊపందుకోవడం.. వివేకా  హత్య కేసులోనూ…

Read More