విజయవాడ
రాష్ట్రంలో శుక్రవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఏలూరు కలపర్రు నేషనల్ హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రైవేటు బస్సు డ్రైవర్ మృతి చెందాడు. హైదరాబాదు నుండి కాకినాడ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, బస్సు డ్రైవర్ ను క్యాబిన్ నుండీ బయటకు తీసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బస్సులోని ఇరవై 0మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
మరో రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం కేవి పల్లి మండలం, మఠంపల్లి క్రాస్ వద్ద జరిగింది. తుఫాన్ వాహనంను లారీ డికొని తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఐదుగురు మృతి చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు బలగాం జిల్లా అతని తాలూకా బండి చేరి గ్రామాను వాసులుగా గుర్తించారు. శ్రీశైల దర్శనం అనంతరం తిరుమల దర్శనానికి వెళ్లి తిరుమల దర్శనం జరగకపోవడంతో తిరిగి వెళుతున్న క్రమంలో ఘటన చోటుచేసుకుంది. తీవ్రగాయలైన వారిని మెరుగైన వైద్యం కోసం ఆరుగురిని తిరుపతి రుయా హాస్పిటల్కి తరలించినట్లు పోలీసులు తెలిపారు