వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
రామగుండంలో కాంగ్రెస్ గెలుపు తథ్యం రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్
రామగుండం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యమని రామగుండం గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్.ఎస్.రాజ్ ఠాకూర్ అన్నారు.క్రషర్ నగర్ కు చెందిన మక్కల రాజు, మక్కల విజయ్, రాజు, సూర్య, మల్లయ్య, నారాయణ, అకశ్, శ్రవణ్, రాకేశ్,మల్లయ్య, నరసింహ, ఆటో నగర్ కు చెందిన మడావి నరేశ, నీరాజ్ సింగ్ , గట్టు రాము, విక్రం ససు, గణేశ్, పింటు తదితరులు ఆదివారం రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియా రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలంతా సిద్ధమయ్యారనిఅని ఆయన అన్నారు. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ అవినీతిని ఎండ కట్టాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని కాంగ్రెస్ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.