రాష్ట్రం మరింత అభివృద్ధి పథం లో వెళ్ళాలంటే బీఆర్ఎస్ పార్టీ ని గెలిపించండి
నరసింహ బస్తిలో జోరుగా ఎమ్మెల్యే కాలేరు పాద యాత్ర
హైదరాబాద్
గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలో రావాలని అంబర్ పేట ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు.నల్లకుంట నరసింహ బస్తీలో ఎమ్మెల్యేకాలేరువెంకటేష్ , నియోజక వర్గ పరిశీలకులు శ్రీ గండ్ర మోహన్ రావు, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ మేడి ప్రసాద్ లతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార పాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అంబర్ పేటలో గతంలో ఎన్నడూ చూడని సంక్షేమం మరియు అభివృద్ధి అందించామని, సీఎం కేసీఆర్ ఆలోచనలు ముందుకు తీసుకెళుతున్నామని వివరించి, రాబోయీ ఎన్నికలలో బీఆర్ఎస్ ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. నరసింహ బస్తీలో మా నమ్మకాన్ని నిలబెట్టునకున్న కాలేరుకే ఓటు వేస్తాం – బీఆర్ఎస్ ను గెలిపించుకుంటామనిబస్తీ ప్రజలు పేర్కొనడం జరిగింది.