మూడు దశాల ఉద్యమాన్ని గుర్తించి గౌరవించిన ప్రదాని మోడీ
బిజెపితోనే తెలంగాణ లో సామాజిక న్యాయం భువనగిరి బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి
మూడు దశాబ్దాల ఉద్యమాన్ని గుర్తించి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి కమిటీని నియమిస్తామని ప్రకటించడం పట్ల భువనగిరి బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.నిన్న జరిగిన మాదిగల విశ్వ రూప మహాసభకార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎస్సి వర్గీకరణ బిల్లుకు సానుకూలంగా స్పందించి, ఒక కమిటీ నీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఎస్సీలలో కొత్త ఆశలు నింపారని భువనగిరి బిజెపి గూడూరు నారాయణరెడ్డి అన్నారు.ఎమ్మార్పీఎస్ పేరిట దాదాపు 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మాదిగ,మాదిగ ఉపకులాలకు, మాదిగ సామాజిక వర్గాలకు అనుకూలంగా ఎ బి సి డి వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ప్రధాని ప్రకటించడం దళిత జాతి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావడమేనని ఆయన అన్నారు.
బిజెపితోనే తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం లభిస్తుందని, బిజెపి మాత్రమే తెలంగాణను సరైన దిశలో నడిపించగలుగుతుందని డబుల్ ఇంజన్ సర్కారు తోనే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని నారాయణరెడ్డి అన్నారు.మంద కృష్ణ మాదిగ గారికి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పై సానుకూలంగా నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ భువనగిరి పట్టణంలొనీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ప్రధాని నరేంద్ర మోడి చిత్రపటానికి భువనగిరి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధి గూడూరు నారాయణ రెడ్డి పాలాభిషేకం చేశారు.వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ ఎస్సి ముఖ్య నాయకులు,దళిత మోర్చ జాతీయ నాయకులు వేముల అశోక్ , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరథ, సుర్వి శ్రీనివాస్,శివ, ఉడుత భాస్కర్, రత్నపురం శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.