శాంతిపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో నారా భువనేశ్వరి పాల్గోన్నారు. రెగడదిన్నేపల్లి గ్రామంలో రోడ్ షోలో ప్రసంగించారు. మా చివరి శ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడం, ప్రజలను హింసించడం జగన్ నైజం. జగన్ మరోసారి సీఎం అయితే రాష్ట్రం వల్లకాడు అవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అవసరం. ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర తలరాతను మార్చాలి. మే 13న రాక్షస పాలనకు ఓటుతో సమాధానం చెప్పాలని అన్నారు.