అరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత. మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులకు,కార్యకర్తలకు,ప్రజలకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నానని .అనకాపల్లిలో నిన్న జరిగిన ప్రధాని బహిరగసభ వేదికపై ప్రధాని నరేంద్రమోదీ నా గెలుపుకు మద్దతుగా తలపై చేయిపెట్టి మనస్పూర్తిగా ఆశీర్వదించారని చంద్రబాబు గారు కూడా నిండుసభలో దీవించారని, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారనీ,, దళితులను చంపి డోర్ డెలివరీ చేసి వాళ్ళు ఇక్కడ రాజకీయనాయకులు గా స్థానికంగా చెలామణి అవుతున్నారని వైసిపి నాయకులను విమర్శించారు. ప్రతి చోటా లాగే రంపచోడవరంలో కూడా గంజాయి రాజ్యమేలుతుందనీ గిరిజనుల మీద నిందలేస్తూ పెద్దలు వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారనీ విమర్శలు చేశారు. త్వరలోనే రంపచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ గారి సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంపీ, ఎంఎల్ఏ బ్యాలెట్ లో వరుస సంఖ్య 3 రావడం జరిగిందనీ . త్రీశూలంవలే మూడుపార్టీలు కలిశాయనీ. ఓటర్లంతా బీజేపీ,టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయానికి పాటుపడి కూటమికి ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు.