సికింద్రాబాద్ బహుజనుల రాజ్యం అంటే మనం స్వయంగా పరిపాలించుకోవడమేనని అందుకు బహుజనులoదరూ ఐక్యంగా ఉండాలని సికింద్రాబాద్ బిఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి దండేపు బస్వా నందం అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బహుజనుల పార్టీ అంటే నాలుగు వర్గాల పార్టీ అన్నారు. కాంగ్రెస్, బిజెపి, బీ ఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల ధనాన్ని వృధా చేసి ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డబ్బులు దండుకునే వాళ్ళే ప్రజలకు ఖర్చు పెడతారని విస్మరించారు. బిఎస్పీ పార్టీ కేవలం బహుజనల పార్టీ అని ఎంపీ అభ్యర్థిగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో బహుజనుల పార్టీ రాజ్యమేలుతుందని ధీమా వ్యక్తం చేశారు.