విజయవాడ మంత్రి తానేటి వనిత మీద టీడీపీ నాయకులు దాడి,విజయవాడలో బొండా ఉమా మహిళల మీద దాడులు మొత్తం చంద్రబాబుకి తెలిసి జరుతున్నాయని వైకాపా అధికార ప్రతినిధు వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. చంద్రబాబు నిన్న సభలో జగన్ ని “అమ్మ మొగుడు” అంటూ బూతులు మాట్లాడుతున్నాడు.మహిళా లీడర్స్ ని బయపెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడు.మహిళా పథకాలు చేయూత,ఆసరా పథకాలను చంద్రబాబు అడ్డుకున్నాడు.చంద్రబాబు ఆదేశాలతో దళిత మహిళా వనిత మీద దాడి జరిగింది. అమిత్ షా మీద తిరపతిలో రాళ్లు వేయించిన వ్యక్తి చంద్రబాబు.కేంద్ర,రాష్ట్ర హోమ్ మినిస్టర్స్ అంటే చంద్రబాబుకి లెక్క లేదు. బెదిరింపులు చేసి అధికారంలోకి రావాలని చంద్రబాబు అనుకుంటున్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్నారని ఎన్నికల కమిషన్ ని చంద్రబాబు ప్రభావిత చేస్తున్నాడు.మహిళలకు పెద్ద పీఠ వేసి 31 లక్షల ఇళ్ల స్థలాలు మహిళలకి ఇచ్చిన ఘనత మా ప్రభుత్వం ది.దళిత మహిళకి హోమ్ మినిస్టర్ పదవి మేము ఇస్తే మీరు దాడులు చేస్తున్నారు..టీడీపీ అధికారంలోకి వస్తే దళితుల మీద దాడులు పెరుగుతాయి.అమరావతి భూములు చంద్రబాబు బినామీలు లాక్కున్నారు.కఠిన చట్టాలు రాకుండా ల్యాండ్ టైటిల్ మీద అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి.మహిళలకి రక్షణ కలిపించాలి తానేటి వనిత మీద దాడి పై విచారణ జరపాలి. ల్యాండ్ టైటిల్ మీద మాట్లాడవద్దని ఈసీ చెప్పిన చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు తీసుకోవడం కాదు చర్యలు తీసుకోవాలి. షర్మిల కల కంటున్నారు అందుకే జగన్ పారిపోతున్నాడని అంటున్నారు. జగన్ ని ఓడించాలని అందరూ చూస్తున్నారు.ప్రజల మనిషి జగన్ కి ఓటమి ఉండదని అన్నారు.