వలస బతుకులు మారాలంటే ఓటర్లు చైతన్యం కావాలి : టిఎస్పీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ చంద్రశేఖర్
జగిత్యాల
జగిత్యాల జిల్లా వలసల జిల్లా కారాదని ఓటు ద్వారానే బతుకులను మార్చుకోవచ్చని, నిరుద్యోగ యువత తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జేఏసీతో భాగస్వామ్యం కావాలని ఆ జేఏసీ రాష్ట్ర చైర్మన్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. 33 జిల్లా ల చైతన్య యాత్ర లో భాగంగా బుధవారం స్థానిక అకాడమీలో నిరుద్యోగ యువతతో చంద్రశేఖర్ మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో ప్రజల బతుకుల్లో సమూల మార్పులు రావాలంటే కేవలం మనదగ్గర ఉన్న ఓటుతోనే సాధ్యమవుతుందని అన్నారు.
మన జిల్లానుంచి వలసలు అగాలన్నా, నిరుద్యోగ యువత దుబాయ్ ఆలోచనలు, గల్ఫ్ దేశాల్లో మరణాలు అగాలంటే మంచి ప్రభుత్వాలు రావాలని అది ఓటు అనే ఆయుదంతోనే సాధ్యమవుతుందని మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లుతుందని చంద్రశేఖర్ అన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు వలిగొండ నర్సింహ, రాష్ట్ర సెక్రటరీ నల్ల లత విశ్వజన్, నవీన్, రవితేజ లు ప్రసంగించారు. ఇందులో ప్రవీణ్, బాను ప్రకాష్ తోపాటు వందమంది విద్యార్థులు పాల్గొన్నారు.