విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన సీఎం వైయస్.జగన్
విజయనగరం
శుక్రవారం నాడు విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వైద్య కళాశాల ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ వైద్యకళాశాలలో ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించి, అనంతరం వివిధ విభాగాలకు చెందిన ల్యాబులను అయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువులు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గోన్నారు.