విశాఖపట్నం
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్య మిస్తోందని ఈ రెండు రంగాల్లో విప్ల వాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజని తెలిపారు.ఆనందపు రం మండ లం శొంఠ్యాంలో 6.67 కోట్లతో నిర్మించ నున్న ఆయుర్వేద మందుల గిడ్డంగి ఔషధ పరీక్షల ప్రయోగ శాల భవన నిర్మాణానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ మల్లి కార్జున తో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు.
బిసీ, బడుగుల రాజ్యాధికారమే నా ధ్యేయం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
ఈ సందర్భంగా మంత్రి విడు దల రజిని మాట్లాడుతూ ఎటువంటి దుష్ప్రభా వాలు లేకుండా ప్రజలకు ఉపయోగపడే వైద్యం ఆయు ర్వేద మని, అటువంటి ఆయుర్వేద వైద్యం ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆచరి స్తున్నాయని,ఇది మన కు ఎంతో గర్వకారణమని అన్నారు.కొన్ని రకాల దీర్ఘ కాల రుగ్మతలకు ఆయుర్వేదం ఎంతగానో ఉపయోగప డుతుందని పేర్కొన్నారు.అటువంటి ఆయుర్వేద వై ద్యానికి ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తూ 6.67 కోట్లతో ఆయుర్వేద మందుల గిడ్డంగి ఔషధ పరీక్షల ప్రయోగశాల విశాఖప ట్నం,శొంఠ్యాంలో ఏర్పాటుతో ఈ ల్యాబ్ ఏర్పాటు వలన సుమారు 100 నుంచి 150 మందికి ఉద్యోగ భృతి కలుగుతుందని అన్నారు.ఇక్కడ రాష్ట్ర వ్యాప్త ఆయుర్వేద గిడ్డంగి రాష్ట్రంలో తయారైన ఆయుర్వేద మందులకు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.