విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష
అమరావతి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. అధికారులు విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని సీఎంకు వివరించారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో టాప్ 10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు జరిగేలా బదిలీలు చేపడుతున్నామని వివరించారు. యూనిట్ టెస్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి.. వారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని తరహా ప్రభుత్వ కాలేజీలలో టాప్ 10 ర్యాంకులను 27 మంది విద్యార్ధులు సాధించినట్టు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చూసుకోవాలి. ఒకటి బాలికలకు, రెండోది కో–ఎడ్యుకేషన్ ఉండాలి. జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైస్కూల్స్ను ఏర్పాటుచేసి వాటిని జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలి. వచ్చే జూన్ నాటికి ఈ జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలి. నాడు – నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలి. సరిపడా సిబ్బందిని అక్కడ నియమించాలని అన్నారు.
వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కార్యక్రమం
సీఎం ఆదేశాల మేరకు విద్యాకానుక నాణ్యత విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు వివరించారు. నాణ్యత పాటించేలా క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో నిర్ధారణ పరీక్షలు. ఇప్పటికే 93 శాతం విద్యాకానుక వస్తువులను నిర్దేశిత కేంద్రాల్లో పంపిణీకి సిద్ధంచేశారు. సీఎం ఆదేశాలమేరకు పుస్తకాలన్నింటినీ కూడా సిద్ధంచేశామన్న అధికారులు. రెండో సెమిస్టర్ పుస్తకాలు అన్నీకూడా ముందుగానే ఇచ్చేందుకు సిద్ధంచేశామన్నారు.
జహీరాబాద్ లో మంత్రి హరీష్ రావు పర్యటన
మొదటి దశ నాడు–నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో ఆరోతరగతి పైబడిన తరగతుల్లో ఐఎఫ్పీ ప్యానెల్స్ ఏర్పాటుపై సీఎం సమీక్ష చేసారు. ప్యానెల్స్ వినియోగంపై టీచర్లకు శిక్షణ కార్యక్రమాలపై సీఎం ఆరా తీసారు. ప్యానెల్స్ను ఎలా వినియోగించాలన్నదానిపై వీడియో కంటెంట్ టీచర్లకు పంపించాలి. కంపెనీల ప్రతినిధులు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తారని, వీరిద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తామని అధికారులు అన్నారు