సచివాలయ విధులతోబాటు శుభ్రత పాటించండి – కమిషనర్ హరిత
తిరుపతి
సచివాలయ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించడంతోబాటు కార్యాలయాన్ని శుభ్రంగా వుంచుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత తెలిపారు. తిరుపతి నగర పరిధిలోని 5 డివిజన్ 1,2 సచివాలయాలను కమిషనర్ హరిత కార్పొరేటర్ పుల్లూరు అమరనాధ రెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ కార్యాలయానికి పనిపై వచ్చే ప్రజలతో ఓపికగా, అర్థమయ్యేలా మాట్లాడాలని, ప్రభుత్వ పథకాల గురించి విపులంగా వివరించాలన్నారు. అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూడాలన్నారు. శానిటేషన్ విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలని చైతన్యవంతం చేయాలని, తడి పొడి చెత్తలను వేరు వేరుగా అందించేలా చూడడంతోబాటు, క్రమం తప్పకుండా యూజర్ చార్జీలు సకాలంలో వసూళ్ళు చేయాలన్నారు.
వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం
యూజర్ చార్జీలు వసూలు చేసే భాధ్యతను వాలంటీర్లపైకి వదిలేయ కుండా శానిటేషన్ సెక్రటరీ, అడ్మిన్లు కూడా పర్యవేక్షించాల్సిందేనని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ స్పష్టం చేసారు. కార్పొరేటర్ అమరనాధ్ రెడ్డి మాట్లాడుతూ తమ వార్డుకు ఆధార్ సెంటర్ మంజూరు అయిందని చెబుతూ, ఆధార్ సెంటర్ నిర్వహణకు సచివాలయం ముందర ఓక రూము ఏర్పాటు చేయించాలని చెప్పడంతో, పరిశీలిస్తామని కమిషనర్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ.రామ్మోమోహన్ రెడ్డి, అడ్మిన్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.