Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సామాజిక పెన్షన్లు పెంచాలి

ఏపీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే లక్ష్మణరావు

0

 పెంటపాడు

ప్రభుత్వాలు ఇస్తున్న వృద్ధులు, వితంతువులు, కళాకారులు, పెన్షన్  6000 పెంచాలని, వికలాంగులకు 7000 పెంచాలని  ఏపీ సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం దర్శిపర్రు, వల్లూరు పల్లి  గ్రామల లో సంఘం ఆధ్వర్యంలో సచివాలయం వద్ద ధర్నా నిర్వహించి సెక్రెటరీ రామారావుకు పెన్షన్ అప్లికేషన్లు ఇవ్వడం
జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే లక్ష్మణరావు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువు ధరలు పెరగడం వల్ల ఏ ఆదరణ లేని వృద్దులు, వికలాంగులు తీవ్ర దుర్భిక్షమైన  జీవనం కొనసాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ డబ్బులు ఎక్కువ శాతం మందులకి ఖర్చవుతుందని దానివల్ల రోజువారి ఆహారం
తీసుకోవడం కూడా కష్టంగా ఉందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు  పోషణ మరియు వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ని సక్రమంగా అమలు చేసి తగులు రక్షణ కల్పించాలని అన్నారు. వివిధ పెన్షన్ పొందుతున్న వారిలో 60 సంవత్సరాలు నిండిన వారందరికీ రైలు, ఆర్టీసీ బస్సులలో ఉచిత పైన కల్పించాలని అన్నారు.  ప్రభుత్వం ఆ విధంగా వీరికి తగు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ
కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మెరిపో జాన్ రాజు పెన్షన్ లబ్ధిదారులు బి శివరాం ప్రసాద్ జి భగవంతుడు వై ప్రసాదు ఎస్ రాజమ్మ పాలూరి తాతారావు వై వెంకటేశ్వరరావు వాని రామారావు ఏ ఆదినారాయణ ఎం బాలయ్య బి నరసింహారావు డి చెంచియా కే రామకృష్ణ ప్రగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie