అనకాపల్లి
అనకాపల్లి చోడవరంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియా సమావేశం నిర్వహించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన బిజెపి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పైన, టైల్స్ కంపెనీ యజమాని బుచ్చిబాబు పైన పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కొండలను, ఇసుకను దోచుకున్న టిడిపి అభ్యర్థి రాజును, గోవాడ షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేసిన మల్లునాయుడును వెంటపెట్టుకుని సీఎం రమేష్ తనపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు.సీఎం రమేష్ లా తాను బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టలేదన్నారు.
కడపలో చేసినట్లు ఇక్కడ రౌడీయిజం చేస్తే ఊరుకోమన్నారు
Prev Post
Next Post