SS Rajamouli : రాజమౌళి ఇప్పుడు వీడియో గేమ్‌లో! డెత్ స్ట్రాండింగ్ 2లో ఎంట్రీ!

SS Rajamouli to Appear in "Death Stranding 2" Video Game!

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మరో సర్‌ప్రైజ్: డెత్ స్ట్రాండింగ్ 2 గేమ్‌లో పాత్ర:ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాలతో పాటు ఇతర ఆసక్తికర విషయాలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆయన ఓ అంతర్జాతీయ వీడియో గేమ్‌లో కనిపించనుండటం సినీ వర్గాల్లోనూ, ఆయన అభిమానుల్లోనూ విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.

SS Rajamouli : రాజమౌళి ఇప్పుడు వీడియో గేమ్‌లో! డెత్ స్ట్రాండింగ్ 2లో ఎంట్రీ!

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాలతో పాటు ఇతర ఆసక్తికర విషయాలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆయన ఓ అంతర్జాతీయ వీడియో గేమ్‌లో కనిపించనుండటం సినీ వర్గాల్లోనూ, ఆయన అభిమానుల్లోనూ విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

వీడియో గేమ్‌ ప్రియులకు సుపరిచితమైన పేరు హిడియో కోజిమా. ఆయన సృష్టించిన ‘డెత్ స్ట్రాండింగ్’ గేమ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. ఇప్పుడు ఈ గేమ్‌కు కొనసాగింపుగా వస్తున్న “డెత్ స్ట్రాండింగ్ 2″లో రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ కూడా కనిపించనున్నారు. ఈ గేమ్‌లో ప్రముఖ హాలీవుడ్ నటులు నార్మన్ రీడస్, ఎల్లీ ఫానింగ్ వంటి వారు కూడా నటిస్తున్నారు. ఈ వీడియో గేమ్ ఈ నెల 26 నుంచి ప్లేస్టేషన్‌లో అందుబాటులోకి రానుంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్‌లో రాజమౌళిది ఓ వినోదాత్మకమైన అతిథి పాత్ర అని తెలుస్తోంది.

రాజమౌళికి, గేమ్‌ డైరెక్టర్ హిడియో కోజిమాకు 2022లోనే పరిచయం ఏర్పడింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జపాన్‌లో ఘనవిజయం సాధించిన సందర్భంగా రాజమౌళి జపాన్ వెళ్లినప్పుడు కోజిమాను కలిశారు. అప్పట్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే, అది కేవలం సినిమా పనుల్లో భాగంగానే జరిగి ఉంటుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు ఇలా వీడియో గేమ్‌లో రాజమౌళి ప్రత్యక్షం కానుండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మరోవైపు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తయ్యాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌లో భాగంగా నీటిలో భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్‌లో మహేశ్ బాబు, ప్రియాంక, పృథ్వీరాజ్‌తో పాటు దాదాపు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నారని, ఇందుకోసం వారంతా ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ వార్తలతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

Read also:Donald Trump : ట్రంప్ మాట మార్చారు: ఇరాన్‌లో నాయకత్వ మార్పు కోరడం లేదన్న అమెరికా అధ్యక్షుడు

Related posts

Leave a Comment