IndiaPakistan : భారత్ – పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న గగనతల ఆంక్షలు:పాకిస్తాన్ తన గగనతలం మీదుగా భారత్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు భారతీయ ఎయిర్లైన్స్పై ఈ నిషేధం కొనసాగుతుందని పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ (PAA) తాజాగా ప్రకటించింది.
పాకిస్తాన్ గగనతలంపై భారత్కు నిషేధం పొడిగింపు
పాకిస్తాన్ తన గగనతలం మీదుగా భారత్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు భారతీయ ఎయిర్లైన్స్పై ఈ నిషేధం కొనసాగుతుందని పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ (PAA) తాజాగా ప్రకటించింది. ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.శుక్రవారం జారీ చేసిన నోటామ్ (ఎయిర్మెన్కు నోటీసు) మధ్యాహ్నం 3:50 గంటల నుండి అమల్లోకి వచ్చింది.
ఈ కొత్త నిషేధం ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు అమలులో ఉంటుంది.మరోవైపు, భారత్ కూడా పాకిస్తాన్ విమానాలకు తన గగనతలాన్ని ఈ నెల 24 వరకు మూసివేసింది. ఏప్రిల్ 22న పుల్వామా ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో భారత్ మొదట ఏప్రిల్ 30న ఈ ఆంక్షలను విధించింది. ఆ తర్వాత ఈ నిషేధాన్ని జూలై 24 వరకు పొడిగించింది. ఈ గడువును ఇప్పుడు మళ్లీ పొడిగించే అవకాశం ఉంది.
Read also:AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం: అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ అవినీతి – సోమిరెడ్డి
