Cricket : ఓవల్‌లో హోరాహోరీ: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, టీమిండియాపై ఒత్తిడి

India vs England

Cricket : ఓవల్‌లో హోరాహోరీ: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, టీమిండియాపై ఒత్తిడి:టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో, అతని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు.

ఐదో టెస్టు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ – ఇంగ్లండ్‌కు కీలక మార్పులు

టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో, అతని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు, టీమిండియా వరుసగా 15వ సారి టాస్ కోల్పోయింది.

భారత జట్టు ఈ మ్యాచ్‌లో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ను తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్, బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ, అలాగే అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. ఇంగ్లండ్ జట్టులో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. గస్ అట్కిన్‌సన్, జేమీ ఓవర్‌టన్, జోష్ టంగ్‌లు జట్టులోకి చేరారు.

ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకబడి ఉంది. ఈ ఐదో టెస్టు టీమిండియాకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గిల్ సేనకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది.

జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఓపెనర్ యశస్వి జైస్వాల్ (2) పెవిలియన్ చేరాడు. కేవలం రెండు పరుగులు చేసి, అట్కిన్‌సన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్: 17/1 (7 ఓవర్లు) ఉండగా.. క్రీజులో కేఎల్ రాహుల్ (8), సాయి సుదర్శన్ (5) ఉన్నారు.

Read also:Kingdom : కింగ్ డమ్ రివ్యూ: విజయ్ దేవరకొండ ప్రయోగం ఫలిచిందా?

 

 

 

Related posts

Leave a Comment