StockMarket : సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో క్లోజ్: మార్కెట్లో సానుకూల వాతావరణం:దేశీయ స్టాక్ మార్కెట్లలో గత నాలుగు రోజులుగా కొనసాగిన నష్టాలకు నేడు తెరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో మార్కెట్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి: నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్లలో గత నాలుగు రోజులుగా కొనసాగిన నష్టాలకు నేడు తెరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో మార్కెట్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 317 పాయింట్లు లాభపడి 82,570కి చేరుకోగా, నిఫ్టీ 113 పాయింట్లు పెరిగి 25,195 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.82 వద్ద ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్లో రాణించిన షేర్లు:
- సన్ ఫార్మా
- బజాజ్ ఫిన్సర్వ్
- టాటా మోటార్స్
- మహీంద్రా అండ్ మహీంద్రా
నష్టాల్లో ముగిసిన షేర్లు:
- హెచ్సీఎల్ టెక్నాలజీస్
- ఎటర్నల్
- టాటా స్టీల్
- కోటక్ మహీంద్రా బ్యాంక్
- యాక్సిస్ బ్యాంక్
- Read also:Nagavamsi : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోపై నాగవంశీ అప్డేట్!
