-
మారుతీ సుజుకీ విడుదల చేసిన తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ విక్టోరిస్
-
రోజు వెయ్యి చొప్పున బుకింగ్స్
-
ఇప్పటి వరకు పది వేల బుకింగ్స్ పూర్తయ్యాయన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెనర్జీ
భారతదేశ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ, తమ మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీకి కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ ఉందని వెల్లడించింది. కంపెనీ విడుదల చేయనున్న సరికొత్త ఎస్యూవీ పేరు విక్టోరిస్. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.5 లక్షల నుండి రూ. 19.99 లక్షల వరకు ఉంటుందని అంచనా.
ఈ ఎలక్ట్రిక్ వాహనంలో హైబ్రిడ్, ఫోర్-వీల్-డ్రైవ్, స్మార్ట్ ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలు ఉన్నాయి. ఇది మొత్తం 21 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
ఈ కారు బుకింగ్లు ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు దాదాపు 1,000 యూనిట్లు చొప్పున బుక్ అయినట్టు మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 10,000 బుకింగ్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ అద్భుతమైన స్పందన పట్ల కంపెనీ సంతృప్తి వ్యక్తం చేసింది.
విక్టోరిస్ ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ఈ మిడ్-సైజ్ ఎస్యూవీ మార్కెట్లో అగ్రస్థానాన్ని సాధించడమే తమ లక్ష్యమని మారుతీ సుజుకీ స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మిడ్-సైజ్ ఎస్యూవీలు మొత్తం 10 లక్షల యూనిట్లు అమ్ముడవగా, హ్యుందాయ్ క్రెటా 1.94 లక్షల యూనిట్ల విక్రయాలతో అగ్రగామిగా ఉంది.
Read also : PMModi : ప్రధాని మోదీకి ఝార్ఖండ్ మహిళ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
