-
కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న నాగ్ అశ్విన్
-
జరిగిన దాన్ని మనం మార్చలేమని ట్వీట్
-
దీపికను ఉద్దేశించే అంటున్న నెటిజన్లు
కల్కి 2898 AD చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీపికా పదుకొణెతో తలెత్తిన వివాదంపై పరోక్షంగా స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఈ సందర్భంగా, నాగ్ అశ్విన్ తన ఇన్స్టాగ్రామ్లో సినిమాలోని ఒక కీలక సన్నివేశాన్ని పంచుకున్నారు.
అందులో, “నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు” అని కృష్ణుడు అశ్వత్థామతో చెప్పే డైలాగ్ ఉంది. ఈ వీడియోకు, “జరిగిన దాన్ని మనం మార్చలేం, కానీ తర్వాత ఏం జరగాలో మనమే నిర్ణయించుకోవచ్చు” అనే క్యాప్షన్ను ఆయన జోడించారు. ఈ పోస్ట్ను నాగ్ అశ్విన్ పరోక్షంగా దీపికను ఉద్దేశించే పెట్టారని నెటిజన్లు, సినీ వర్గాలు భావిస్తున్నాయి.
దీపికా పదుకొణె తొలగింపు
నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిన్న ఒక సంచలన ప్రకటన చేసింది. సినిమా సీక్వెల్ నుంచి దీపికా పదుకొణెను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒక ప్రాజెక్ట్కు పూర్తిస్థాయి నిబద్ధత అవసరమని, ఆ విషయంలో దీపికతో కలిసి ముందుకు సాగలేకపోతున్నామని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలను మాత్రం వారు స్పష్టం చేయలేదు.
దీపికా ఈ సినిమా నుంచి వైదొలగడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రెమ్యునరేషన్ పెంచాలని, రోజుకు ఏడు గంటలు మాత్రమే పనిచేస్తానని, తనతో పాటు వచ్చే 25 మంది సిబ్బందికి ఫైవ్ స్టార్ వసతులు కల్పించాలని ఆమె డిమాండ్ చేసినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై దీపిక గానీ, ఆమె ప్రతినిధులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ మొత్తం వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారగా, నాగ్ అశ్విన్ పోస్ట్ ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?
Read also : AP : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయాలు: నాలా ఫీజు రద్దు
