AnilAmbani : అనిల్ అంబానీ కార్యాలయాలపై ఈడీ దాడులు: మనీలాండరింగ్ ఆరోపణలు:రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీలోని ఆయన కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
అనిల్ అంబానీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీలోని ఆయన కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా అధికారులు ముంబైకి చేరుకున్నట్లు సమాచారం. అయితే, అనిల్ అంబానీ నివాసంలో మాత్రం ఎలాంటి తనిఖీలు జరగడం లేదు.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థలు మనీలాండరింగ్కు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్తో పాటు అనిల్ అంబానీకి చెందిన ఇతర కంపెనీలలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఇటీవల సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. అంతేకాకుండా, రిలయన్స్ కమ్యూనికేషన్స్తో పాటు ఆ సంస్థ ప్రమోటర్-డైరెక్టర్ అనిల్ అంబానీని ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ ‘మోసపూరితం’గా పరిగణించిన విషయం తెలిసిందే.
Read also:Tata : టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ జీతం 15% పెంపు: లాభాలు తగ్గినా భారీ వేతనంపై చర్చ
