“పుష్ప 2” మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం జరిగింది. నార్కట్ పల్లి వద్ద ఆర్టీసి బస్సును వెనకనుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఘటనలో ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తున్న పలువురు పుష్ప 2 మూవీ ఆర్టిస్టులకు గాయాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన వాళ్లని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వారంతా షూటింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో వుండగా ఘటన జరిగింది. ప్రమాదంతో హైద్రాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై కాసేపు ట్రాఫిక్ జాం అయింది. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
‘పుష్ప 2’లో అల్లు అర్జున్ తోపాటు రష్మిక, ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ ఈసారి అంతకు మించి అనేలా సినిమాను తీస్తున్నట్లు సమాచారం
పవర్ ఫుల్ ఎమోషన్స్ వున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అహింస: హీరో విక్టరీ వెంకటేష్.