తుగ్గలి
తెలుగుదేశం పార్టీతోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే ఈ శ్యాంబాబు తెలియజేశారు.త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల రాంపురం కొట్టాల,రాంపురం, చిన్న జొన్నగిరి,గుత్తి ఎర్రగుడి,జాప్లా తాండ,లక్ష్మీ తాండ,గుండాల తాండ,మిద్దె తాండ,రోల్లపాడు, రోళ్ళపాడు తాండ,ఎల్లమ్మ గుట్ట తాండ,బాట తాండ,సూర్య తాండ,ఉప్పర్లపల్లె మరియు జొన్నగిరి గ్రామాలలో సుడిగాలి పర్యటనను నిర్వహించి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా గ్రామాలకు విచ్చేసిన టిడిపి అభ్యర్థి కేఈ శాంబాబుకు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు టపాసులు పేలుస్తూ శాలువాను కప్పి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా కే.ఈ శ్యాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అన్ని వర్గాల సమాన అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలియజేశారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళలకు,యువతకు, విద్యార్థులకు మరియు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలోకి దూసుకెళుతుందని ఆయన తెలియజేశారు.కేంద్రంలో గల బిజెపి సహకారంతో రాజధాని మరియు పోలవరం పనులు పూర్తవుతాయని ఆయన తెలియజేశారు.కావున త్వరలో జరగబోయే ఎన్నికలలో పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శాంబాబు సైకిల్ గుర్తుకు, ఎంపీ అభ్యర్థి బస్తి పార్టీ నాగరాజు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీను అధికారంలోకి తీసుకురావాలని ఆయన ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శాలివాహన కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు,రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ చౌదరి, టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిమ్మయ్య చౌదరి, మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు వెంకటరాముడు చౌదరి,జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాజశేఖర్, మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేష్,మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సురేష్ చౌదరి ఎర్రగుడి మాజీ సర్పంచ్ వెంకటస్వామి ఉప్పర్లపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్ రాంపురం మాజీ సర్పంచ్ చంద్రన్న మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ మల్లయ్య,బొందిమడుగుల ప్రతాప్, జొన్నగిరి సర్పంచ్ ఓబులేసు,సంఘాల కృష్ణ,పార్థ, జొన్నగిరి బాలన్న,కొత్తూరు శివరాముడు, చక్రపాణి,ఉప్పర్ల పల్లె ఓబులేసు,రాము నాయక్, ఎద్దులదొడ్డి శ్రీనివాసులు,పగిడిరాయి ఈశ్వర్ రెడ్డి,గిరిగెట్ల మళ్లీ,బొందిమడుగుల మోహన్ తదితర మండల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prev Post
రేపటి నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తున్న విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్”
Next Post