బద్వేల్ పట్టణం త్యాగరాజ నగర్ కాలనీలో బుధవారం ఉచిత టైలరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు టైలరింగ్ సెంటర్ ను రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు బీసీ రమణ ప్రారంభించారు. సంఘమిత్ర సంస్థ అధ్యక్షులు సొద్దల పెంచలయ్య మాట్లాడుతూ ఒంటరి మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో ఆర్థికంగా ఎదుగుటకు టైలరింగ్ శిక్షణను నేర్చుకోవాలని అన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజంలో గౌరవంతో బ్రతకొచ్చని పెంచలయ్య అన్నారు దళిత నాయకులు ఓ ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ ఈ శిక్షణలో మహిళలందరూ క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకుని సంఘమిత్ర సంస్థ కి కుటుంబ సభ్యులకి మంచి పేరు తేవాలని కోరారు సంఘమిత్ర లో సభ్యులై సమస్త సహకారంతో మహిళలు అన్ని విధాల ఎదగాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సంఘమిత్ర సంస్థ కోఆర్డినేటర్ ఎస్కే జహీరా ఆస్మా డైరెక్టర్ ఆర్ సి సుబ్బారెడ్డి 30 మంది కుట్టు శిక్షణ మహిళలు పాల్గొన్నారు
జిల్లా కలెక్టర్ చెప్పినా… తగ్గేదేలేదంటూ రెచ్చిపోతున్న మట్టి మాఫియా..