బుధవారం నాడు ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ లయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్లో ట్విన్ టవర్స్కు శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాంతో స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే ప్రయాణీకులు పలు ఇబ్బందులు ఎదుర్కున్నారు.