కొలిమిగుండ్ల, కొలిమిగుండ్ల మండలంలోని బంధార్ల పల్లె, తుమ్మలపెంట, గోరుమానుపల్లె, పెట్టికోట గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలలో టిడిపి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి రోడ్ షో లో పాల్గొన్నారు. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి లేదని ఆయన వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి, నంద్యాల రామేశ్వర్ రెడ్డి, వి ఆర్ . లక్ష్మీరెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి, నారాయణరెడ్డి, ఇటిక్యాల బాల్రెడ్డి, శివారెడ్డి, తోట అమర్నాథ్ రెడ్డి, తోట నాగ మల్లారెడ్డి, తోట పరమేశ్వర్ రెడ్డి బాయికాటి బ్రదర్స్, సూరపురెడ్డి విశ్వనాథరెడ్డి, కళ్యాణ్ రెడ్డి, పులి ప్రకాశ్ రెడ్డి, పులి సుదర్శన్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి, పల్లె వెంకటేశ్వర్ రెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, మందా విజయ్, మంద శ్రీనివాస్, దస్తగిరి, పెద్ద చెన్నారెడ్డి, వెంకటేశ్వరరావు, కత్తి రామదాసు, ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.