పత్తికొండ రాష్ట్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఇంటింటి పెన్షన్ పంపిణీ నిలిపివేయడంతో వృద్ధులు వికలాంగులు వితంతువు పడుతున్న కష్టాలు వర్ణాతితం. పత్తికొండ మండలంలోని 17 గ్రామ పంచాయతీ వృద్ధులు వికలాంగులు వితంతువు మరిన్ని రకాల పింఛన్లు దారులు 6,736 ఉన్నారు. ఇంటింటికి 1,986 పెన్షన్లను మంజూరయ్యాయి. పెన్షన్ల అందక వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పత్తికొండకు గ్రామీణ ప్రాంతాల నుండి వృద్ధులు వితంతువు వికలాంగులు బ్యాంకుకు వస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ కు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయడంతో బ్యాంకుల చుట్టూ వృద్ధులు ఉదయం నుంచి సాయంకాలం వరకు వేచి చూసి తీరాక బ్యాంకు ఉద్యోగస్తులు అకౌంట్ కు ఈ కేవైసీ, మరిన్ని సాంకేతిక సమస్యలతో పంపించేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ సర్వీస్ సెంటర్ల దగ్గర ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో త్రాగడానికి నీరు కూర్చోవడానికి కుర్చీలు సరిగా లేవని, ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి నలిగిపోతున్నామని బ్యాంకు ఉద్యోగస్తులపై వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో పింఛను అందజేయాలని కోరుతున్నారు..