కేంద్ర ప్రభుత్వం మోడీ 9 సంవత్సరాల పరిపాలనలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో బిజెపి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్ పాల్గోన్నారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని పలు కీలక అంశాలు వివరించారు. రానున్న కాలంలో దేశం మరింత అభివృద్ధి చెందే విధంగా మోడీ పాలన కృషిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గం ఇంచార్జ్ పట్టణ బిజెపి నాయకులు పలువురు పాల్గొన్నారు.