తిరుమల: తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, హీరోయిన్ నయ న తార దంపతులు దర్శించుకున్నా రు. ఈ నెల 7వ తారీఖున షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం విడుదల కానుండంతో స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు షారుక్ ఖాన్, నయనతా రలు తిరుమలకు చేరుకున్నారు. మం గళవారం వేకువజామున స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపం డితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.. షారుక్ ఖాన్ ఆలయం వెలుపలికి రాగానే, అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండ డంతో ఆలయం వద్ద నుంచి కారు ఉన్న ప్రదేశం వరకు షారుక్ ఖాన్ పరుగులు తీశాడు.