బహుజనులకు రాజ్యాధికారమే బీఎస్పీ అంతిమ లక్ష్యం -బిసిలకు 70 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తాం -బీఎస్పీ మంథని నియోజకవర్గం ఇంచార్జి జనగామ రవి కుమార్
బహునులకు రాజ్యాధికారం తీసుక రావడమే మా అంతిమ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రములో బీఎస్పీ పార్టీ నాయకులు పని చేస్తున్నారని బీఎస్పీ మంథని నియోజకవర్గం ఇంచార్జి జనగామ రవి కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి మంథని మండలంలోని ఉప్పట్ల గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి బీఎస్పీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించి ఏనుగు గుర్తును ప్రచారం చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం రావాలనే అంతిమ లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు.
మహనీయులు కలలు కన్న రాజ్యం కోసం జ్యోతి రావు పూలే, అంబేద్కర్, కాన్షిరాం ఆశయాలను నెరవేర్చడం కోసం, బహుజన రాజ్యం తీసుక రావడం కోసం పేద బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేయడం కోసం బీఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పోరాటం చేస్తున్నారన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రము లో ప్రతి గడప గడప కు, ప్రతి పల్లె పల్లెకు బీఎస్పీ ని తీసుకువెళ్తున్నామన్నారు. ప్రగతి భవన్ కి ఆర్ఎస్పి ని పంపడమే మా అంతిమ లక్ష్యంగా తాము పని చేస్తున్నామన్నారు.
గద్వాల జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.
బిసి లకు 70 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అసెంబ్లీ కి పంపడమే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్దేశం అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ అన్ని వర్గాల వారికి విద్య, వైద్యం, ఉపాధి, అవకాశలు కలిపించడమే తమ పార్టీ ఉద్దేశం అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కోశాధికారి గడ్డం శేషాద్రి స్వేరో, బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు జనగామ మల్లేష్, కాసార్ల పోషమల్లు,మంథని సెక్టార్ అధ్యక్షులు కాసిపేట రాజ్ కుమార్,ఉపట్ల గ్రామ బూత్ అధ్యక్షులు చాకినారపు లక్ష్మణ్,గ్రామ ఉపాధ్యక్షులు నరేష్,గ్రామ బూత్ కార్యదర్శి సదానందం,బీఎస్పీ పార్టీ కార్యకర్తలు శ్యామ్,శ్రీనివాస్, రాజేష్, శ్రవణ్,రాజశేఖర్,తదితరులు పాలుగోన్నారు.