మూడవ రోజు కొనసాగిన ఆర్టీయే తనిఖీలు | RTEA inspections continued for the third day | Eeroju news

మేడ్చల్ మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆద్వర్యంలో మేడ్చల్ జాతీయ రహదారి పై స్కూల్  బస్సులు మరియు వాహనాల లపై  ఆర్.టి.ఏ  అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఆర్.టి.ఓ ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు మేడ్చల్ ఎంవిఐ  బాబు ఆద్వర్యంలో స్కూల్ బస్సు లు తనిఖీలు చేపట్టారు. ఈ విద్యాసంవత్సరంలో  పాఠశాల లు పునః ప్రారంభం కావడంతో ఆర్.టి.ఓ అధికారులు కొరడా ఝలిపించారు. పలు స్కూల్, ఇంజనీరింగ్ కాలేజ్ బస్సుల పై ఆర్టీవో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..ఇప్పుడు వరకు ఫిట్ నెస్ లేని వాహనాలు, సరైన దృవ పత్రాలు లేని 10 బస్సు లపై  మేడ్చల్ ఆర్.టి.ఓ అధికారులు కేసు లు నమోదు చేశారు…

Read More

మహిళా శక్తి పథకం..ఆరంభం | Mahila Shakti Scheme..start | Eeroju news

హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శక్తి పథకం కింద మరో సర్వీస్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’ ల ఏర్పాటుకు సీఎస్ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘ లను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్‌లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్‎లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఎస్. ఇప్పటికే, అన్న క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీ కా రసోయ్…

Read More

ఫామ్ ఆయిల్ ద్వారా అధిక లాభం | High profit through farm oil | Eeroju news

పెద్దపల్లి రైతులు ఫామ్ ఆయిల్ పంట ద్వారా  అధిక లాభం పొందవచ్చని, ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, విదేశాల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లి లో జిల్లా ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా నుండి విదేశీ శాస్త్రవేత్తలు హాజరైన రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఫామ్ ఆయిల్ పంట సాగు చేయడంతో పాటు అంతర్ పంటలు వేసుకొని మంచి లాభాలు పొందవచ్చునని, ఈ పంట ద్వారా రైతులకు తాలు, కట్టింగ్ వంటి సమస్యలు లేవని, ప్రభుత్వం ప్రొచ్చహకంగా సబ్సిడీ అందిస్తుందని, ఈ పంటకు సంబందించిన విత్తనాలు, మలేషియా నుండి దిగుమతి చేసుకుని రైతులకు సబ్సిడీ గా అందిస్తుందని, పంటను అమ్ముకోవడానికి ఇక్కడ త్వరలో ప్రభుత్వం సహకారంతో కంపెనీని ప్రారంభిస్తామని అన్నారు.…

Read More

ఇంకా సీఎం కేసీఆరే… | And CM KCR… | Eeroju news

భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  చర్ల మండలం పులిగుండాల గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడి నిర్వకం ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తున్నా ఇంకా ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి ఉన్నట్లుగానే బడిబాట కార్యక్రమంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పాఠశాల గోడకి కట్టడమే కాకుండా ఊరంతా మరో ఫ్లెక్సీతో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించటంతో ప్రధానోపాధ్యాయుడిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పులి గుండాల గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలో  అధికారంలో ఉన్న ప్రభుత్వమేంటో విద్యాశాఖ మంత్రెవరో, ముఖ్యమంత్రేవరో తెలియని ఈ టీచర్లు మా బిడ్డలకు ఏం చదువులు చెప్పి మా భవిష్యత్  మార్చుతారని ఇలాంటి టీచర్లను వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు…

Read More

జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం | Cabinet sub-committee meeting on Geo 317 | Eeroju news

దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 30వ తేదీ వరకు అవకాశం హైదరాబాద్ జూన్ 13 జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం  సమావేశ మైంది.ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు .  ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది.  ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 14 నుండి జూన్ – 30వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది.  ఈ సమావేశంలో వెబ్ సైటు ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ – ఆప్షన్ ఇవ్వడం…

Read More

రైతు రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం | Cabinet meeting to finalize the procedures for the implementation of farmer loan waiver | Eeroju news

 హైదరాబాద్ రాష్ట్రంలోని రైతులకు ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 18న సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి. వెల్లడించనున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవల వ్యవసాయ, ఆర్థిక శాఖాధికారులను సీఎం ఆదేశించారు. రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం.. అందుబాటులో ఉన్న వనరులు, నిధుల…

Read More

రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్య పుస్తకాల పంపిణీకి బ్రేక్..? బుక్స్ వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు | Break for the distribution of textbooks across the state..? The education department orders to take back the book | Eeroju news

హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ కొత్త గందరగోళానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల్లో అధికారులు, ఉపాధ్యాయులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు వాటితో పాటు వర్క్ బుక్‌లను కూడా పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పుస్తకాల్లో ప్రచురణకు సంబంధించి కొత్త వివాదం తలెత్తింది. పుస్తకాల్లోని మొదటి పేజీలో ఉండే ముందుమాట మార్చుకుండానే విద్యాశాఖ పుస్తకాలను ముద్రించినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ విషయం కాస్త వివాదాస్పదం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాల పంపిణీని నిలిపివేసి, ఇప్పటి వరకు పంపిణీ చేసిన పుస్తకాలను కూడా వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆయా జిల్లాల డీఈవోలకు సమాచారం అందజేసింది.

Read More

రక్తదానం ఒక సామాజిక బాధ్యత:- డాక్టర్ లిల్లీ మేరి.. నేడు ప్రపంచ రక్తదాత దినోత్సవం | Blood donation is a social responsibility:- Dr. Lily Marie.. Today is a special article on the occasion of World Blood Donor Day | Eeroju news

సిద్దిపేట జూన్ 13 అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణం పోసేది రక్తదానం.  దీనిని కృత్రిమంగా ఉత్పత్తి చేయడం సాధ్యపడదు. రక్తదానం ఒక పవిత్ర కార్యo.  పోయిన ప్రాణాలను మనము ఎలాగో తీసుకురాలేము. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ప్రాణాలను ఒక్కోసారి సాటి  మనిషి రక్తముతో కాపాడగల ము. ఇది రక్త దానము తోనే సాధ్యం.  పుట్టినరోజులు, పెళ్లిరోజులు చేసుకుంటూ బంధుమిత్రులకు విందు ఇవ్వడం కంటే ఇలాంటి రోజులలో రక్తదానం చేయడం గొప్ప సంతృప్తినిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు రక్తదానంపై ప్రజలలో ఇంకా సరైన అవగాహన లేదు. ఎన్నో అపోహలు  వెంటాడుతున్నాయి. రక్తదానం విషయంలో స్త్రీ  పురుషుల అన్న తేడా లేదు. ఇద్దరూ రక్తదానానికి అర్హులే. అయితే కారణాలు ఏమైతేనేం రక్తదానం విషయంలో ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా స్త్రీలు కొంతవరకు ముందుకు రావటం లేదు. ఈ పరిస్థితి…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు ఈడి ఎంట్రీ..? | Phone tapping case ED entry..? | Eeroju news

హైదరాబాద్  తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతుందా.? ఈ కేసు వివరాలను ఈడి అధికారులు ఎప్పటికప్పుడు ఆరాతిస్తున్నారా.? త్వరలో ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారిన అక్రమ నగదు లావాదేవీల మీద విచారణ కు ఈడి వచ్చే అవకాశం ఉందా.? అంటే అవుననే ప్రచారం జరుగుతుంది ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మీద తెలంగాణ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు దీంతో ఈడి రాక ఖాయం అనే వాదన మొదలైంది. తెలంగాణలోని గత రెండు అసెంబ్లీ ఎన్నికల బిఆర్ఎస్ అభ్యర్థులకు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు సమకూర్చామని రాధా కిషన్ రావు ఆయన బృందంలోని అనేకమంది పోలీస్ అధికారులు విచారణలో కుండ బద్దలు కొట్టడంతో పాటు ఈ వందల కోట్ల అక్రమ నగదు లావాదేవీల  విచారణ…

Read More

25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి : హరీశ్ రావు.. | 25 thousand teacher posts should be filled : Harish Rao.. | Eeroju news

హైదరాబాద్ 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ద్వారా 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు కేవలం 11 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనఊరు- మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని సూచించారు. స్కూళ్లలో పారిశుధ్య సిబ్బందిని నియమించాలని, బడులకు ఫ్రీ కరెంటు ఇవ్వాలని కోరారు.

Read More