- కామారెడ్డి, గజ్వేల్ నుంచి బరిలోకి
- బీఆర్ఎస్ జాబితా విడుదల
- అనర్హత కారణంగా వేములవాడలో అభ్యర్థి మార్పు
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్తో పాటుగా కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చ ఏస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఏడుగురు అభ్యర్థులను మార్చినట్లు ప్రకటించారు. వైరా, ఆసిఫాబాద్, బోథ్, ఉప్పల్ స్థానాల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు.
KCR released BRS party candidates lists
Click Here To Download: BRS Party List
దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి, హుజురాబాద్లో పాడి కౌశిక్రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు టికెట్ కేటాయించారు. కంటోన్మెంట్ స్థానంలో లాస్య నందిత పోటీ చేయనున్నారు. ఇక, కోరుట్ల నుంచి విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్, ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి పోటీ చేయనుండగా, ములుగు నుంచి బాదే నాగజ్యోతి, భద్రాచలం తెల్లం వెంకట్రావుకు ఈసారి అవకాశం కల్పించారు. ఇక వివాదాల్లో ఉన్న జనగామ సెగ్మెంట్తో పాటుగా నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు.