తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దర్ కీలకపాత్ర
Gaddar played a vital role in the achievement of Telangana state
- గద్దర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు
- ప్రజా విప్లవ కెరటం గద్దర్ కు కాంగ్రెస్ శ్రేణుల నివాళి
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొని తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యం చేసి రాష్ట్ర సాధనలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ కీలక పాత్ర పోషించారని టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మిదేవెందర్ రెడ్డిలు పేర్కొన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ మృతికి సంతాపంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్దర్ లేని లోటు పూడ్చలేనిదని, తెలంగాణ ఉద్యమంలో తన ఆట,పాటలతో ఉద్యమానికి ఊపిరిపోసారని అన్నారు.
జగిత్యాలతో గద్దర్ కు అవినాభావ సంబంధం ఉందని, పెత్తందారుల, దొరల పాలనకు వ్యతిరేకంగా 1978, సెప్టెంబర్ 9న జగిత్యాలలో జరిగిన జగిత్యాల జైత్రయాత్రలో తన ఆట, పాటలతో ఉద్యమానికి స్ఫూర్తినింపారని గుర్తు చేసుకున్నారు. పీడిత, తాడిత ప్రజల పక్షాన తన పాటలతో అండగా నిలిచారని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాటుపడ్డారని పేర్కొన్నారు. గద్దర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని చెబుతూ, కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న ఖమ్మం బహిరంగ సభలో గద్దర్ పాల్గొని, తన ఆట, పాటలతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్తేజం నింపారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధు, పులి రామ్, మొయిజోద్దీన్, పీఏ గంగాధర్, అజార్, చాంద్ పాషా,మన్సూర్, నేహాల్, ఎలిగేటి నర్సయ్య, అల్లాల రమేష్ రావు, చిట్ల అంజన్న, బొల్లి శేఖర్, నాంచారి రాజు, హబీబ్, పెద్దులు, రాజేందర్, క్యాతం రాములు, చిట్ల లత, దివాకర్, లక్ష్మణ్, చెట్టె భార్గవ్, జుంబర్తి కిశోర్, కోండ్ర రాజేశ్, బోగ సందీప్, రాగుల ప్రదీప్, గిరిధర్, అసీం సావన్, శ్రీపాద సంతోష్, నాగేంద్ర, అర్బాబ్, నదీం, అతాహుల్లా షరీఫ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.