జీవిఎంసీ ప్లాస్టిక్ పై యుద్దాన్ని కొనసాగిస్తోంది.పరిధిలో ప్రత్యేక బృందాలు ద్వారా 623 కేజీల సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను సీజ్ చేయడం జరిగిందని, 5,50,200 రూపాయిలు జరిమానా విధించడం కూడా జరిగిందన్నారు జీవిఎంసీ కమీషనర్ కమిషనర్ సాయి కాంత్ వర్మ.ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్ ఐదు అంశాలతో ఎకో వైజాగ్ ప్రచారం ప్రారంభమైందని చెప్పారు.ఎకో జీరో పొల్యూషన్ లో భాగంగా డోర్ టు డోర్ వ్యర్ధాల సేకరణకు 65 ఎలక్ట్రిక్ ఆటో లు జూలై నుండి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు.పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటే కార్యక్రమం మరోసారి ప్రారంభిస్తున్నామని తెలిపారు.