పేదలను దగా చేసిన జగన్ సర్కార్
Janasena leaders Chaganti Muralikrishna fire on ycp jagananna colonies
నర్సాపురం: జగనన్న కాలనీలకు పేరుతో ప్రభుత్వం ఇల్లు లేని పేదలని దగా చేసిందని జనసేన నాయకులు చాగంటి మురళీకృష్ణ మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని లక్ష్మనేశ్వరం పెద్ద సారవ గ్రామాల్లోని జగనన్న కాలనీలను సందర్శించి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాలనీలను ఏర్పాటుచేసి రెండు ఏళ్లు గడిచిన కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.