కేసీఆర్ దేశ్ కీ నేతా.. కేసీఆర్ దేశ్ కీ నేతా.. ఇటీవల కాలంలో కేసీఆర్ టూర్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఫ్లెక్సీలు ఇవి. రాష్ట్రానికే పమితమైన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు జాతీయ పార్టీగా పేరు మార్చుకొని భారత రాష్ట్ర సమితిగా మారింది.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికల కంటే ముందే వస్తాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాందేడ్ లేదా నాగపూర్ ఎంపీ స్థానాన్ని ఎంపిక చేసుకుంటారని తెలుస్తుంది. కర్ణాటకలో ఎన్నికలు జరిగిన కన్నెత్తి చూడని BRS.. మహారాష్ట్రలో మాత్రం విపరీతమైన హడావుడి చేయడానికి కారణం ఇదేనని ఇన్సైడ్ టాక్.
మహారాష్ట్రలో నియోజకవర్గాల వారిగా ఇన్చార్జిలు, జిల్లాల అధ్యక్షులను నియమించింది బీఆర్ఎస్. పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్లను కూడా నియమించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి పూర్తిస్థాయిగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కేసీఆర్ ఆలోచన. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే నాందేడ్లో.. లేదంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం, విద్యావంతులు ఎక్కువగా ఉండే నాగపూర్లో ఎంపీగా సీఎం కేసీఆర్ బరిలో దిగబోతున్నారని సమాచారం. అక్కడ అయితే గెలుపు ఈజీగా ఉంటుందని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారనేది సమాచారం అప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తూ.. పలువురు ముఖ్యనేతలను కలుస్తున్నారు సీఎం కేసీఆర్.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లోకి ఒక ప్రాంతీయ పార్టీ విస్తరించడం చాలా కష్టమనేది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. కానీ కేసీఆర్ వ్యూహాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఉద్యమ సమయంలో కూడా పార్టీని విస్తరించిన విధానం ఇందుకు ఉదాహరణ. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో పార్టీని విస్తరించేందుకు ఒకసారి కరీంనగర్లో పోటీ చేశారు.. మరోసారి ఎవరూ ఊహించని విధంగా మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఇక ఎమ్మెల్యేగా కూడా సిద్ధిపేటను వదిలి గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
తెలంగాణలో గద్దర్ కొత్త పార్టీ..
ఇలా ఎప్పటికప్పుడు అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్ నైజం.ఈసారి కూడా భారత్ రాష్ట్ర సమితిని విస్తరించడంలో.. తెలంగాణ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే చర్చ పార్టీలో సీరియస్గా నడుస్తుంది. పక్క రాష్ట్రంలో పోటీ చేస్తేనే అక్కడ పార్టీకి ఆదరణ దక్కుతుంది. అక్కడి కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందనే అలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రపై ఫుల్ ఫోకస్ పెట్టారు కేసీఆర్. నాందేడ్, నాగపూర్లో పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభించారు.
మహారాష్ట్రకు వరుస పర్యటనలు చేస్తూ, బహిరంగ సభలు నిర్వహిస్తూ మహారాష్ట్రలో చురుగ్గా ఉంటున్నారు. మరోవైపు తెలంగాణను ఆనుకుని ఉన్న సరిహద్దు గ్రామాల్లో కొన్ని గ్రామపంచాయతీలు కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. దీంతో నాందేడ్ లేదా నాగపూర్ ఎంపీ స్థానాల నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని.. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. పార్టీ అధినేత కేసీఆర్ మదిలో కూడా అదే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది.