- మరో మూడు నెలల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేసీఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా అందరూ కలిసి పోరాడాలని, రానున్న మూడు నెలలు చాలా కీలకమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఇందిరా భవన్ లో నియోజకవర్గస్థాయి ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అన్ని మండల గ్రామ స్థాయి ఓటర్ల జాబితాను శనివారం సాయంత్రం లోపు పార్టీ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రతి 100 మంది ఓటర్లకు, ఒక ఓటరు సమన్వయకర్తగా ఎంపిక చేయాలని, ఒక వారంలో కాంగ్రెస్ సమయకర్తలకు శిక్షణా శిబిరం నిర్వహిస్తామన్నారు.
ఓటర్ మ్యాపింగ్ వారంలోగా పూర్తి చేయాలని, శనివారం లోపు అన్ని బూతులలో వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని, NSP నీరు విడుదల చేయనందుకు నిరసనగా అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న గౌడ్, మాజీ ఎంపీపీ మంజు నాయక్, గిరిబాబు ,నిజాముద్దీన్ ,ఇట్టి మల్ల బెంజిమెన్, కంకణాల పుల్లయ్య , దాసరి పున్నయ్య పాల్గొన్నారు.