సీనియర్లకు పార్టీలో గుర్తింపు లేదు..
Seniors have no recognition in the party Raja Mallu joining in congress
- అందుకే పార్టీ వీడుతున్న
- మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు
నియోజవర్గంలో బిఆర్ఎస్ పార్టీలోని సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్య త లభించడం లేదని మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుకు నిరసనగా ఈనెల 4న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భం గా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలువాక రాజయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమల్లు మాట్లాడుతూ, మనోహర్ రెడ్డి గెలుపు కోసం గత ఎన్నికల్లో కృషి చేసినట్టు తెలిపారు.
అయినప్పటికీ పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వకుండా, పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా అవమానించడం ఆయనకే చెల్లిందన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెల్లినప్పటికీ పరిస్థితిలో మార్పులేదన్నారు. పార్టీ మారకుండా ఉండేందుకు పలువురితో ఒత్తిడి చేయించినట్లు వివరించారు. తనతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో పలువురు బిఅర్ఎస్ నేతలు పాల్గొన్నారు.