ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఇటీవల కాలంలో నాగుపాములు ఎక్కువగా సంచరిస్తున్నాయి. భూ వేడి తాపానికి తట్టుకోలేక పాములు పొలాలలో ఇండ్ల వద్ద చల్లగా ఉండే ప్రదేశాల కోసం వస్తున్నాయి. అందులో భాగంగా మండల పరిధిలోని హసినాపురం ,తాటిచెర్ల గ్రామాల మధ్య పొలాల వైపు సేద తీరడానికి ఓ నాగుపాము రాగా రెండు కుక్కలు పామును దాదాపు గంట పాటు నిలేశాయి. ఇరువైపులా కుక్కలు పాము మీదకే అరుస్తూ దాడికి ప్రయత్నించగా పాము ఏ మాత్రం చలించకుండా అలాగే ఉండిపోయింది.
దాదాపు గంట తర్వాత కుక్కలు వెళ్లిపోవడంతో పాము పొలాల వైపు వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు.ఇది ఇలా ఉండగా అల్లినగరం గ్రామంలో ఇటీవల కాలంలో సమీప ప్రాంతం నుంచి జాతీయ పక్షి నెమలి దాహార్తి తీర్చుకోవడం కోసం గ్రామంలోకి అడుగు పెట్టింది. చెట్ల పైన ,ఇండ్లపైన తిరుగుతూ దాదాపు పది రోజుల పాటు గ్రామస్తులను సందడి చేసింది. ఇటీవల కాలంలో అది ఎక్కడికో వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మరోవైపు దాహార్తి కోసం కొత్త రకం పిచ్చుకలు ఇళ్ల వద్దకు వచ్చి దాహార్తిని తీర్చుకుంటున్నాయి.